ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఫోన్ చెడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.ఇక ఈ రోజుల్లో మొబైల్ లేకుండా అసలు ఎవరు కూడా ఉండలేరు. అయితే ఇందులో పెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్ మెయింటెన్ చేయడం చాలా పెద్ద సమస్య.వాస్తవానికి ఫోన్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇక అప్పుడే మీ స్మార్ట్ఫోన్ చాలాసేపు పనిచేస్తుంది. అయితే చాలామందికి ఫోన్ ఛార్జింగ్ విషయంలో సందేహాలు ఇంకా అలాగే అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు నాసిరకం ఛార్జర్లని అస్సలు ఉపయోగించకూడదు. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎక్కువ దుష్ప్రభావం పడుతుంది. చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్లను ఎంపిక చేసుకోవటమే చాలా ఉత్తమం. ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది అసలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇక మీరు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్ను ఆఫ్ చేసి మాట్లాడండి.
అలాగే మీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్ను తీసుకోవటం ఆటోమెటిక్గా మానేస్తుంది. అయితే నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో ఎక్కువగా మోరాయిస్తుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.ఇంకా మీ ఫోన్ ఒక యంత్రం. దానికి ఎంతోకొంత విరామం కూడా చాలా అవసరం. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను ఆఫ్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ను చాలా ఈజీగా పెంచుకోవచ్చు.ఇంకా ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియని మీరు మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం చాలా ఉత్తమం.ఇంకా అలాగే వేడి వాతావరణంలో ఫోన్ను ఉంచటం కూడా అసలు అంత మంచిది కాదు.ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.