ఇక ఈ షావోమి కంపెనీ ఇండియాలో ఎంత బాగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మంచి బడ్జెట్ ధరలో సామాన్యులకు అందుబాటులో వున్న ఈ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో రికార్డు స్థాయిలో ఎప్పుడూ కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రతి స్మార్ట్ ఫోన్లలో కూడా చాలా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఖచ్చితంగా బ్యాటరీ ప్రధానమైనదని చెప్పాలి. ఫోన్ ని కొన్ని రోజులు వాడగానే బ్యాటరీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కంపెనీ బ్యాటరీ దొరకడం ఇప్పుడు అసలు అంత సులభమైన విషయం కాదు.అందులో ఇక మరీ ముఖ్యంగా షావోమీ బ్రాండ్కు చెందిన రెండ్ ఇంకా అలాగే ఎంఐ ఫోన్లలో కొన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లలో బ్యాటరీలను అంత సులభంగా అసలు మార్చలేము. ఇక ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టడానికే షావోమీ కంపెనీ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 'బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక ఇందులో భాగంగా రూ. 499 నుంచే కొత్త బ్యాటరీని కొనుగోలు చేసే అవకాశం కూడా ఆ కంపెనీ కల్పించింది.
ఇక ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో తెలుపుతూ అధికారికంగా ట్వీట్ చేసింది షావోమీ యాజమాన్యం.అలాగే బ్యాటరీని మార్చుకోవడానికి దగ్గరల్లో ఉన్న షావోమీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కు వెళ్లాలని కూడా కంపెనీ సూచించింది. ఇక అంతేకాకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ని కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక షావోమీ సర్వీస్+ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ స్మార్ట్ ఫోన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నేరుగా సర్వీస్ సెంటర్కు వెళితే క్షణాల్లో మీ బ్యాటరీని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు.ఈ బ్యాటరీల ప్రారంభ ధర వచ్చేసి రూ. 499గా ఉంటుందని తెలిపినప్పటికీ స్మార్ట్ ఫోన్ మోడల్ బట్టి ధర అనేది ఇక మారుతుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఇతర కంపెనీలకు చెందిన బ్యాటరీలను ఉపయోగించడం వల్ల స్మార్ట్ ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో షావోమీ వినియోగదారుల అవసరాల దృష్ట్యా ఇక ఈ సరికొత్త ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టింది.