బుల్లిపిట్ట: అదిరిపోయే ఫీచర్స్ తో సాంసంగ్ నుంచి స్మార్ట్ ఫోన్ విడుదల..!!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ .. 2022 పేరుతో సరికొత్త మోడల్ ను దక్షిణకొరియా లో ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. 2020 లో ప్రారంభించిన గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ మోడల్ ను ఈ కొత్త మొబైల్ పోలి ఉంటుంది. ఇక ధర కూడా పాత మోడల్ తో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. 120 Hz సూపర్ AMOLED డిస్ప్లేతో చాలా ఆకర్షణీయంగా ఈ మొబైల్ కనిపించడం గమనార్హం. ఇక స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలను అమర్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 4500 ఎమ్ ఏ హెచ్ తో రూపొందించడం జరిగింది.
ఇక ఈ మోడల్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేయనున్నారు ఇంకా సాంసంగ్ ప్రకటించకపోవడం గమనార్హం. స్టోరేజ్ విషయానికి వస్తే.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర కొరియన్ కరెన్సీలో 699,600 KRW. ఇక భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.43,500 అన్నమాట. గత మోడల్ సాంసంగ్ గెలాక్సీ S20 FE 2020 వేరియంట్ ధర కంటే ఈ మోడల్ తక్కువ ధరకు లభించడం గమనార్హం. కొరియన్ కరెన్సీలో గత మోడల్తో పోల్చుకుంటే 200,000 KRW తక్కువ. అంతే భారత కరెన్సీలో దాదాపు 12,400 రూపాయలు.