పెరుగుతున్న మహీంద్రా కార్స్ సేల్స్!

ఇక ఇండియాలో మహీంద్రా కార్ల అమ్మకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పాలి. ఇండియన్ ఫేమస్ యుటిలిటి వెహికిల్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న న్యూ జనరేషన్ మహీంద్రా థార్ ఇంకా సరికొత్త ఎక్స్‌యూవీ700 వంటి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ వలన కంపెనీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడచిన మార్చి 2022 నెలలో మహీంద్రా కంపెనీ మొత్తం 54,643 యూనిట్ల వాహనాలను అమ్మింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2021 నెలలో) కంపెనీ అమ్మిన 40,403 యూనిట్ తో పోలిస్తే, గత నెల అమ్మకాలు అనేవి 35 శాతానికి పైగా పెరిగాయి.ఇక మహీంద్రా గ్రూప్ ఇండియాలో వివిధ ఆటోమొబైల్ విభాగాలలో వాహనాలను అమ్ముతుంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే 2022లో చాలా వరకు విభాగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. అయితే, గత ఏడాదితో పోలిస్తే, మూడు చక్రాల (త్రీ వీలర్) వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.



మహీంద్రా ఆటోస్ మార్చి 2022లో 27,380 యూనిట్ల యుటిలిటీ వెహికల్స్ (UVలు) అమ్మింది. కాగా, గత సంవత్సరం ఇదే సమయంలో వీటి అమ్మకాలు కేవలం 16,643 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. అంటే, ఈ సమయంలో యుటిలిటి వాహనాల అమ్మకాలు ఏకంగా 65 శాతం పెరిగాయి.ఇకపోతే, మార్చి 2022 లో కార్లు ఇంకా వ్యాన్‌ల మొత్తం అమ్మకాల సంఖ్య 223 యూనిట్లుగా ఉంది. అయితే ఇవి తక్కువగానే అనిపించినప్పటికీ, మార్చి 2021లో ఇక మహీంద్రా అమ్మిన 57 యూనిట్లతో పోలిస్తే మాత్రం ఇవి 291 శాతం వృద్ధిని సాధించాయి.ఇక   మహీంద్రా కంపెనీ తన ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో ప్రధానంగా మహీంద్రా కెయూవీ100, మహీంద్రా ఎక్స్‌యూవీ300, మహీంద్రా బొలెరో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా మరాజో, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంకా అలాగే మహీంద్రా అల్టూరాస్ జి4 వంటి యుటిలిటీ వాహనాలను అమ్ముతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: