వామ్మో.. రోజు 5GB.. ఇలాంటి ఆఫర్ కనీవినీ ఎరుగరు?
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో దాదాపు అన్ని ప్రైవేట్ టెలికాం రంగ సంస్థలు భారీగా టారిఫ్ చార్జీలు పెంచాయి. దీంతో ఎంతో మంది వినియోగదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలా ప్రైవేటు టెలికాం రంగ సంస్థలు రోజురోజుకి ఛార్జీలు పెంచుతూ ఉన్న సమయంలో ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఒక అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించి మిగతా టెలికాం రంగ సంస్థలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం టెలికాం రంగంలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
కేవలం 599 రూపాయల ప్లాన్ రీఛార్జి చేసుకుంటే ప్రతిరోజూ ఏకంగా 5 జీబీ డాటా లభిస్తుంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా పంపించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆఫర్ అక్కడితో ముగిసిపోయింది అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అర్ధ రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా అన్లిమిటెడ్ ఫ్రీ డేటా ను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ నిర్ణీత సమయంలో ఎంత డేటా వాడుకున్నప్పటికీ ఒక రోజు వారి రోజు వారి 5 జిబి డేటా మాత్రం అలాగే ఉంటుంది. అంతే కాకుండా అటు ప్లాన్ కాల పరిమితి కూడా 84 రోజులు కావడం గమనార్హం. ఇప్పటివరకు ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదు.