త్వరపడండి.. ఆ స్మార్ట్ వాచెస్ పై 54% డిస్కౌంట్...

ఇక ప్రముఖ హోం లైటింగ్, స్మార్ట్ హోం ప‌రిక‌రాల‌ త‌యారీదారు సిస్కా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ వినియోగదారులకు మంచి మంచి ప్రొడక్ట్స్ ని ఇచ్చింది. ఇక కొత్తగా ఈ కంపెనీ స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేయ్యడం జరిగింది. ఇండియాలో గణనీయమైన వృద్ధితో ఎదుగుతున్న స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన రెండో కంపెనీగా సిస్కా నిలవడం జరిగింది. ఇక సిస్కా త‌న కంపెనీ నుంచి తొలిసారిగా స్మార్ట్‌వాచ్‌ బోల్ట్‌ ఎస్‌డ‌బ్ల్యూ100ను ఆవిష్క‌రించడం జరిగింది. ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ 10 రోజుల లాంగ్‌లాస్టిక్‌ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది.కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.

ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ సైజ్ విషయానికి వస్తే మొత్తం 1.28 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే 10 ర‌కాల విభిన్న‌మైన స్పోర్ట్స్ ట్రాకింగ్ మోడ్స్‌ను ఇందులో అమర్చడం జరిగింది. ఇక అంతేగాక ఐపీ 68 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది.ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ని బ్లూటూత్‌ వి5తో అన్ని రకాల ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్లతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ SpO2 పర్యవేక్షణ, చేతి శానిటైజేషన్ రిమైండర్, పల్స్‌రేటు, వెదర్ రిపోర్ట్ ను ఈ వాచ్‌ అందించనుంది. ఇక అలాగే ఈ స్మార్ట్‌ వాచ్‌ స్పేక్ట్రా బ్లూ, స్పేస్‌ బ్లాక్‌, ఒషన్‌ గ్రీన్‌ కలర్ వేరియంట్లలో మార్కెట్లో రానుంది.ఇక ధర విషయానికి వస్తే సిస్కా స్మార్ట్‌వాచ్‌ ధరను రూ. 5,499గా నిర్ణయించడం జరిగింది. ఇక ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ వాచ్‌ను సుమారు 54 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 2,499లకు అందించనుంది.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. ఈ వాచ్ ని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: