అలాంటి వారికే మూత్రపిండ సమస్యలు.. కారణం అదే?

sangeetha

 ఇప్పుడున్న జనరేషన్ లో కాలానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగం చేసేవారిలో చాలా మంది కూర్చొని పనిచేసే ఉద్యోగులు కూర్చొని చేస్తున్నందున వారికి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా మొత్తం తో పోల్చుకుంటే జీవనశైలి వ్యాధుల బారిన పడే ఉన్న వారి శాతం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎక్కువగా యువత ఈ వ్యాధుల బారిన పడుతున్నారని   సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి పైగా  కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నారని గణాంకాలు లో వెల్లడైంది. ఇప్పటికే సగానికి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉండగా, వీరి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.

అయితే ఇంకా చాలామంది ఫ్రీ డయాబెటిస్ ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. వీరందరూ కూడా రానురాను డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల జాబితాలో చేరుతారు. అయితే ఇవే కాకుండా హైబీపీ సమస్య కూడా ఇప్పుడు చాలా మందిలో పెరుగుతోంది. ఇవన్నీ కూడా మూత్రపిండ వ్యాధులకు కారణమవుతున్నాయి. మధ్య వయసు అనగా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిలో చాలా మంది జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని వీరిలో కిడ్నీ సంబంధ వ్యాధులు చాలా మందికి వస్తున్నాయని న్యూఢిల్లీలోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ నెప్రాలజీ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ పి విద్య శంకర్ తెలిపారు. ఈ వయసు ఉన్నవారు ఎక్కువగా కూర్చుని పని చేస్తున్నారని శారీరక శ్రమ చేయడం లేదని. దీనితో జీవనశైలి వ్యాధుల బారిన పడి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

 జీవనశైలి వ్యాధులు తద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలి అంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చెక్ చేయించుకోవాలి. కిడ్నీలలో ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవాలి. జంక్ఫుడ్ నూనె పదార్థాలను ఎక్కువగా తినరాదు. నిత్యం వ్యాయామం చేయాలి కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలా ప్రయోజనం ఉంటుంది.

 నొప్పులను తగ్గించి కునేందుకు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడరాదు. వీటికి బదులుగా సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ ను వాడవచ్చు. పసుపు లవంగాలు, యాలకులు,అల్లం వంటి పదార్థాలను వాడితే నొప్పులు, వాటివల్ల వచ్చే వాపులు కూడా తగ్గుతాయి. నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలి. ధూమపానం,మద్యపానం చేయరాదు ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల జీవనశైలి వ్యాధి అయినా డయాబెటిస్ వంటివి రాకుండా ఉంటాయి. దీనితో కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: