తెలుగు రాష్ట్రాలలో ఆర్టిసీ బస్సు నెంబర్ బోర్డు పై Z అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

sravani
సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు బోర్డు నెంబర్ ను మీరు ఎప్పుడైనా గమనించారా. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులకుT S అని, ఆంధ్రప్రదేశ్ బస్సులకు ఏపీ అని రాసి ఉంటుంది. అయితే రాష్ట్రాల పేర్లు పెట్టుకున్న తర్వాత Z అనే అక్షరాలు కూడా రాసి ఉంటారు. ఈ విధంగా Z అనే అక్షరం నెంబర్ ప్లేట్ పై ఎందుకు రాసి ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా?అసలు ఈ విధంగా ఈ  అక్షరం రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1932 సంవత్సర కాలంలో హైదరాబాద్ నిజాం గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన తల్లి పేరు జహ్రా బేగం. ఈయన హైదరాబాద్ నవాబుగా ఉన్నప్పుడు బస్సు రవాణా సంస్థను ప్రారంభించారు. అయితే ఈ విధంగా బస్సు రవాణా సంస్థను ప్రారంభించినప్పుడు బస్సు సంఖ్య 22 మాత్రమే ఉండేది. అప్పట్లో బస్సు నెంబర్ లు మొదట్లో HYZ అనే అక్షరాలతో మాత్రమే రాసి ఉండేవారు.ఈ HYZ అనే అక్షరాలకు బదులుగా ఉస్మాన్ అలీ ఖాన్ బస్సులకు తన తల్లి పేరును పెట్టాలని భావించారు. అయితే ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించిన బస్సులకు ఈ విధంగా ఒక వ్యక్తి పేరు పెట్టకూడదని తెలియడంతో బస్సులకు HYZ అక్షరాలను పెట్టారు.
తన తల్లి పేరు పెట్టడానికి కుదరలేదు కాబట్టి అందుకు గుర్తుగా తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని నెంబర్ ప్లేట్ పై పెట్టారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీని ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో తెలంగాణకు TS అని, ఆంధ్రప్రదేశ్ కు ap అని మొదటగా రాసి తరువాతZ అనే అక్షరాన్ని పెట్టడం తన తల్లికి ఇస్తున్న గౌరవ సూచకంగా భావిస్తూ ఇప్పటికీ ఆ అక్షరాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ Z సిరీస్ కేవలం ఆర్టిసి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ బస్సులకు మాత్రమే ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆర్టీసీ సంస్థలు నడపడానికి తీసుకున్న ప్రైవేట్ బస్సులకు Z సిరీస్ ను ఉపయోగించరు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బస్సు నెంబర్ ప్లేట్ పై Z అనే అక్షరం ఉండటానికి అసలైన కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: