ప్రముఖ మొబైల్ కంపెనీలలో శాంసంగ్ కంపెనీ ఒకటి.. ఈ కంపెనీ విడుదల చేసిన ఫోన్లు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇకపోతే ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్ లాంఛ్ కానుంది. ఆ ఫోన్ పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఫోన్ స్పెసిఫికేష న్లు మాత్రం ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. దాంతో ఫోన్ కు మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వస్తుందని అంటున్నారు. రిలేజ్ అవ్వకముందే ఫోన్కు డిమాండ్ పెరిగిందంటే అందులో అంత స్పెషల్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం..
గెలాక్సీ ఏ32 5జీ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ సపోర్ట్ పేజీ గత వారమే లైవ్లోకి వచ్చేసింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తుంది.ఫోన్ కు సంబందించిన ఫోటోలు ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఫొటోల ప్రకారం బ్లాక్, బ్లూ, వైట్, పర్పుల్ రంగుల్లో లాంచ్ కానుంది.ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. వీటిని ఫోన్ వెనక ఎడమవైపు పైభాగంలో అమర్చారు. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ కూడా అందుబాటులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ వెనకవైపు అందించారు.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ మోడల్ నంబర్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది..ఎఫ్సీసీ లిస్టింగ్ ప్రకారం గెలాక్సీ ఏ32 5జీ 15W చార్జర్తో రానుంది. అలాగే 10W ఫాస్ట్ చార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు ఇప్పటి వరకు వచ్చినవి యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వకుం డానే మరో ఫోన్ మంచి క్రేజ్ ను అందుకుంది.. మార్కెట్ లోకి విడుదల అవ్వగానే ఈ ఫోన్ సేల్స్ భారీగా పెరగడం ఖాయమని తెలుస్తోంది..