కొత్త ఫీచర్లతో లాంఛ్ అయిన హువావే.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!!

Satvika
హువావే ఫోన్లు కూడా మార్కేట్ లో మంచి డిమాండ్ తో దూసుకుపోతున్నాయి.. ప్రస్తుతం ఈ కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. ప్రస్తుతం చైనా ఈ కొత్త ఫోన్లు సందడి చేస్తున్నాయి..హువావే ఎంజాయ్ 20 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు.ఇకపోతే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. మరి కొన్ని ప్రత్యేకతలు కూడా కలిగివుంది..

ప్రస్తుతం ఈ ఫోన్ మాత్రం చైనా మార్కెట్ లో విడుదల చేశారు.. మంచి డిమాండ్ తో దూసుకుపోతుంది.. చైనా మార్కెట్ లో వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా ఆ ఫోన్ అంతగా ఫీచర్ల ను ఇప్పుడు చూద్దాం..ఆక్టాకోర్ కిరిన్ 710ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఈఎంయూఐ 10.1 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో ప్రత్యేకంగా ఉంచారు..

వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉండగా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. అయితే ఈ ఫోన్ చాలా వెరియంటలలో లభిస్తుంది..4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా 14,600  ఉండగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.16,900 నిర్ణయించారు. మ్యాజిక్ నైట్ బ్లాక్, క్విజింగ్ ఫారెస్ట్, డాన్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.. మరో విషయమేంటంటే చైనా లో మరో రెండు రోజుల్లో ఈ ఫోన్ లాంఛ్ కానుంది..ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: