టీవీ: సుడిగాలి సుదీర్ ని తొక్కేశారా..హీరోగా ఫెయిల్యూర్ అయ్యారా..?

Divya
ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్.. ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉండేది.. కానీ ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ షోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ జబర్దస్త్ పుణ్యమా అంటే చాలామంది తెలుగు సినీ పరిశ్రమకు నటులుగా యాంకర్లుగా డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. హీరోగా సుధీర్, కమెడియన్ గా హైపర్ ఆది, డైరెక్టర్ గా వేణు, హీరోగా రాకింగ్ రాకేష్ ఇలా చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

గతంలో హీరోగా పలు పలు చిత్రాలలో నటించారు. 2017లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్.. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, కోతల రాముడు, పండుగాడు, గాలోడు తదితర చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరోయిన్ దివ్యభారతిని తీసుకున్నారు. అయితే కొన్ని కారణాలు చేత ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్లే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గొట్ సినిమా  డైరెక్టర్ కూడా సైలెంట్ అయ్యారని సమాచారం దీంతో సుదీర్ మళ్ళీ యాంకర్ గానే తన కెరీర్ ని మలుచుకుంటున్నారు. తాజాగా హోస్ట్ గా చేస్తున్న సమయంలో సుధీర్ గురించి ఒక పంచ్ వేయడం జరిగింది. షోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్యాగ్రౌండ్ నుంచి పులిహోర కలపడం అనే మ్యూజిక్ ని వేయడం జరిగింది. దీంతో సుధీర్ కూడా హర్ట్ అయ్యి ఆ అమ్మాయి ప్రశ్న అడగమన్నది మీరే ఆ తర్వాత పులిహోర కలుపుతున్నారా అన్నట్టుగా వేస్తున్నారు..ఇంత బ్యాడ్ చేయాలని చూస్తున్నారా అంటూ సుధీర్ ఫన్నీగా అయితే అన్నారు. అయితే సుధీర్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయలేక వచ్చిన అవకాశానన్న ఉపయోగించుకోవడం వల్లే హీరోగా సక్సెస్ కాలేకపోయారని.. గాలోడు సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సుదీర్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇకమీదట హీరోగా సుధీర్ సక్సెస్ కాలేరు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం హీరోగా కంటే బుల్లితెర పైన కనిపిస్తేనే క్రేజ్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: