టీవీ: నిద్ర మాత్రలు మింగిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇమే హీరో భార్య కూడా..?

Divya
టాలీవుడ్లో యంగ్ హీరో గా పేరు పొందిన హీరో వరుణ్ సందేశ్ మొదట హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.దీంతో కొద్దిరోజులకే సినిమాలలో విలన్ గా కూడా నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. వరుణ్ సందేశ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ వితికా షేర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇప్పటివరకు పిల్లలే కాలేదు. నిత్యం ఈ విషయం పైన ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. అయినప్పటికి ఈ విషయం పైన అదిరిపోయే కౌంటర్లను సైతం ఇస్తూ ఉంటారు ఈ జంట.

అయితే వరుణ్ తో పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటికి ఈ వార్తలు వైరల్ గా కావడంతో తాజాగా వరుణ్ సందేశ్ ఈ విషయం పైన అసలు విషయాన్ని తెలియజేశారు.. ముఖ్యంగా తన భార్య వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని దీంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అప్పుడు తనకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు ఇలాంటి మందులు ఇచ్చారని వాటితో పాటు వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిపారు.

అయితే వితికా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము. కానీ అందులో నిజం లేదని తెలిపింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని వరుణ్ సందేశ్ తెలిపారు. అయితే వెంటనే ఈ విషయం తెలియగానే బయలుదేరి వచ్చేసానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని వరుణ్ తేజ్ తెలిపారు. ఫైనల్ వరకు కూడా వెళ్లలేకపోయినా ఇద్దరూ చాలా వారాలు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా హౌస్ నుంచి బయటికి వచ్చిన మాపై సోషల్ మీడియా వేదికగా నెగటివ్స్ కూడా ప్రచారం చేశారు. ఇలా చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: