టీవీ: ఈ సీరియల్ నటి స్టార్ హీరోయిన్ చెల్లెలనీ తెలుసా..?

Divya
తెలుగులో ప్రముఖ ఎంటర్టైర్మెంట్ ఛానల్ గా పేరుపొందిన చానల్స్ లో జీ తెలుగు కూడా ఒకటి.. ఇందులో ముద్దమందారం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది నటి హరిత.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె భర్త జాకీ కూడా పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇప్పటికి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గతంలో టాలీవుడ్లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రవళి చెల్లెలి ఈ హరిత..

హరిత పెళ్లి సందడి, శుభాకాంక్షలు, ముద్దుల మొగుడు తదితర చిత్రాలలో నటించింది.. రవళి 1990వ సంవత్సరంలో విడుదలైన జడ్జిమెంట్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్ ,మలయాళం అంటి సినిమాలలో కూడా నటించిన పెద్దగా గుర్తింపు రాలేకపోయింది. తెలుగులో డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆలీబాబా అరడజన్ దొంగలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలతో నటించిన రవళి.. ఆ సమయంలోనే నీలి కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

రవళికి హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె సోదరి హరిత మాత్రం ప్రస్తుతం బుల్లితెర పైన అద్భుతంగా రాణిస్తూ ముందుకు వెళుతుంది  ఈ మధ్యనే రవళి కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు పలు రకాల సన్నాహాలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రవళి మాట్లాడుతూ తన పాత్రకు ప్రాధాన్యత కలిగి ఉండే పాత్ర వస్తే కచ్చితంగా తిరిగి మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలిపింది. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు కూడా బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. మరి రవళి కూడా తన సోదరీ మాదిరి బుల్లితెర పైన ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: