టీవీ: బిగ్ బాస్ వల్లే నాకు నష్టం.. ఎమోషనల్ అయినా శోభా శెట్టి..!!

Divya
తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్ గా మంచి పాపులారిటీ సంపాదించిన కార్తీకదీపం సీరియల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా ఇందులో మౌనిత పాత్ర అంటే తెలియని వారంటూ కూడా ఉండరు.. ఇందులో ఆమె విలన్ గా నటించింది. ఈ పాత్రలో కూడా జీవించిపోయింది. డాక్టర్ బాబు వంటలక్క తర్వాత మళ్లీ మౌనిత పాత్రకి ప్రజలు బాగా కనెక్ట్ అయిపోయారు.. అందుకే ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈ క్రేజీ తోని బిగ్ బాస్ -7 లో కూడా ఎంట్రీ ఇచ్చింది మోనిత.

అక్కడ కూడా ఇమే చాలా ఫైర్ అయ్యింది. అదే ఈమెకు చాలా మైనస్ గా మారింది. కెరీర్ కు కూడా బ్రేక్ పడేలా చేసిందని ఇటీవల శోభా శెట్టి ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది. అందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. తాజాగా కార్తీకదీపం-2 సీరియల్ మొదలు కాబోతోందని ఈ సీరియల్ లో ప్రోమోన్ కూడా టీమ్ మొత్తం రిలీజ్ చేశారు.. అయితే ఇందులో మాత్రం ఎక్కడా మౌనిత కనిపించలేదు..

తనకి కార్తీకదీపం-2 సీరియల్లో అవకాశం రాలేదంటూ ఆమె స్వయంగానే తెలియజేసింది. తనకి 2 ఆఫర్ రాకపోవడానికి బిగ్ బాస్ హౌస్ లో తనని విలన్ గా చూశారని కార్తీకదీపం లో కూడా మౌనిత లాగా ఎలా చూశారో హౌస్ లో కూడా అలాగే చూశారని వెల్లడించింది.. కార్తీక్ దీపం-2 ప్రోమోని చూశాను చాలా బాగుంది. అయితే ఈ సీరియల్ లో తాను నటించలేకపోవడం చాలా బాధగా ఉంది.ఇదంతా బిగ్ బాస్ వల్లే తన కెరీర్ కు బ్రేక్ పడిందని చెప్పకనే తెలియజేసింది శోభా శెట్టి.. అయితే హౌస్ లో ఫైనల్ వరకు ఉండి బాగానే సంపాదించి అలా వచ్చిన డబ్బుతో తన కలలను నెరవేర్చుకొంది. ఇటీవలే ప్రియుడుతో కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని కొత్త ఇల్లు కూడా కొనింది ఇతరత్రా వ్యాపారాలలో కూడా బిజీగా ఉంది మౌనిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: