టీవీ: అదే ఉదయభాను కెరియర్ను నాశనం చేసిందా..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ ఉదయభాను పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు..తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులతో స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది.. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వారు ఉన్నప్పటికీ కూడా బుల్లి ఇతరులను ఒక వెలుగు వెలిగింది ఉదయభాను.. ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొని యాంకర్ గా కూడా పేరు సంపాదించింది అయితే కుటుంబ కష్టాలు ఆర్థిక ఇబ్బందులతో 15 ఏళ్ల వయసులోనే యాంకర్ గా అడుగుపెట్టిన ఉదయభాను హృదయాంజలి ప్రోగ్రాం తో మొదటిసారి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత వరుస పెట్టి వన్స్ మోర్ ప్లీజ్, జానవులే నెరజాణవులే, సాహసం చేయరా డింభకా ,నీ ఇల్లు బంగారం కాను వంటి షోలు చేసింది. అలా యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది.. ఎర్రసైన్యం ,లీడర్, శ్రావణమాసం, కొండవీటి సింహం వంటి చిత్రాలలో నటించింది.. అలా నెమ్మదిగా బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయిన ఈమె బుల్లితెరకు దూరమైంది.. దీంతో ఒక్కసారిగా ఉదయభాను జీవితంలో పలు రకాల రూమర్స్ వైరల్ గా మారాయి. ఆమె ఎవరితోనో ఎఫైర్ పెట్టుకోమని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని ఇలా ఎవరికి తోచినట్టుగా వారు రాయడంతో ఈమె కెరియర్ తగ్గిపోయింది. ఈ వార్తలు వినలేక ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉండేదట.

వివాహమైన తర్వాత సుమారుగా పదేళ్ల తర్వాత ఉదయభానుకు ట్విన్స్ జన్మించారు. అలా వారి ఆలనా పాలనతోనే ఆమెకు క్షణం కూడా తీరిక లేకుండా ఉండడంతో ఇంటికే పరిమితమైందట ఉదయభాను. అలా నెమ్మదిగా వెండితెరకు దూరము అవ్వడంతో ఉదయభాను కెరియర్ డీలా పడిపోయింది.. అంతేకాకుండా ఒక సినిమాలో ఏమైనా చాలా అసభ్యకరంగా చూపించడంతో అప్పటినుంచి సినిమాలలో అవకాశాలు వచ్చిన నటించడానికి మక్కువ చూపలేదట.. ఈమధ్య మళ్ళీ జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఒక షోకి యాంకర్ గా రావడానికి ప్రయత్నాలు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: