టీవీ: డైరెక్టర్ సూర్యకు.. బుల్లితెర నటి సుజిత కి మధ్య బంధం ఏంటో తెలుసా..?
కానీ డైరెక్టర్ సూర్య కిరణ్ మరణించిన తర్వాత అసలు విషయాలు తెలుసుకొని ప్రేక్షకులే ఆశ్చర్యపోతున్నారు.. కళ్యాణి హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు. 2022లో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా కళ్యాణి అందుకున్నది. అయితే తమ విడాకుల గురించి అటు కళ్యాణి కానీ ఇటు సూర్య కిరణ్ కానీ ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు. అయితే వీరిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణాన్ని బుల్లితెర నటి సుజిత గతంలో ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది.
సుజిత ఎవరో కాదు సూర్య కిరణ్ యొక్క చెల్లెలు.. దీంతో కళ్యాణి ఈమెకు (వదిన)అవుతుంది.. ముఖ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఆర్థిక సమస్యలే అంటూ తెలిపింది.. దర్శకుడుగా తమ కెరీర్ ని ప్రారంభించిన తర్వాత సత్యం సినిమా తర్వాత ఏ సినిమాలు తెరకెక్కించిన పెద్దగా తన సోదరుడు సక్సెస్ కాలేకపోయారని.. అలా అవకాశాలు కూడా తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.. దీంతో తన అన్న వదిన విడిపోయారని వెల్లడించింది..నటిగా కొన్నేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తన కళ్యాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి రీఎంట్రీ ఇచ్చిందని వెల్లడించింది సుజిత.. టాక్సీవాలా, యాత్ర వంటి చిత్రాలలో నటించింది. కళ్యాణి కూడా చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెల్లమెల్లగా హీరోయిన్గా ఎదిగిందని తెలిపింది. అయితే సుజిత సూర్య కిరణ్ కు చెల్లెలు అవుతుందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.