టీవీ: మల్లి సీరియల్ మాలిని రియల్ లైఫ్ స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

Divya
కరోనా వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా టీవీకే పరిమితమై సీరియల్స్ కి బాగా అలవాటు పడిపోయారు. దీంతో టీవీ సీరియల్స్ యాక్టర్స్ భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాకుండా అంతకుమించి అవకాశాలను దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే ప్రేక్షకుల కారణంగా ఈ సీరియల్స్ టిఆర్పి రేటింగులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. దాంతో టీవీ సీరియల్స్ వారికి అవకాశాలు రావడమే కాదు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న మల్లి సీరియల్ కూడా ఒకటి.
ఇది ప్రసారమైన అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షక ఆదరణ పొంది భారీ టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులకు కూడా ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కింది. ఈ సీరియల్లో నటిస్తున్న మాలిని ఈటీవీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ప్రేమనగర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తన అందం,  నటన ,అభినయంతో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను  సొంతం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలో జన్మించిన మాలిని అసలు పేరు దీపా జగదీష్. ప్రస్తుతం ఈమె బెంగళూరులో నివాసం ఉంటుంది.
కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో లా పట్టా అందుకుంది దీపా.ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో నటననే కెరియర్గా మార్చుకున్నారు దీపా. మహాసతి అనే సీరియల్ తో దీప కన్నడ బుల్లితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. వారొస్తారా, బ్రహ్మాస్త్ర,  కావ్యాంజలి వంటి కన్నడ సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. కన్నడ సీరియల్స్ లోనే కాదు కన్నడ సినిమాలలో కూడా నటించి అక్కడ ఫేమ్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు ఇలా తెలుగు సీరియల్స్ లోకి అడుగుపెట్టి తన సత్తా చాటుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: