టీవీ: షాక్..అలా చేస్తే వారిపై అహ క్రిమినల్ చర్యలు..!!

Divya
తెలుగు బుల్లితెర పై ప్రముఖ ఓటిటి సమస్థ ప్రస్తుతం బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఓటిటి లో విడుదలయ్యే టాక్ షో నిర్వహించిన అన్ స్టాపబుల్ షో మరింత పాపులర్ అయింది. ఇక ఇందు లో సరికొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. అయితే శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు ఈ షో ని నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తూ సీజన్ -2 ని ప్రారంభించడం జరిగింది. దీంతో టాప్ టెన్ టాక్ షోలో నెంబర్ వన్ స్థానాన్ని ఇదే సంపాదించుకుంది.
ఆన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎంతమంది జీవితాలను మార్చింది. బాలకృష్ణ తో పాటు ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసిన గెస్టులు ఎంతో మంది సహాయాన్ని అందించి ఎంతోమంది జీవితాలను మార్చారు.ఇలాంటి ప్రోగ్రాం మరింత మందికి చేరువ చేయడం కోసం ఆహా మరొకసారి తన ముందడుగు వేస్తోంది. నందమూరి హార్డ్ కోర్ ఫాన్స్ అందరు సే నో టు పైరసీ అని ముందుకు రావాలని కోరింది. అన్ స్టాపబుల్ సీజన్ 1 లో అక్రమంగా పలు వెబ్సైట్లో తమకు సంబంధించిన కొన్ని వీడియోస్ అందుబాటులో ఉన్నాయని ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ పోరాటం చేయడానికి ఆహ ముందడుగులు వేస్తోంది అని ఆహా సంస్థ తెలియజేసింది..

అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె -2 ను ఎవరైనా పైరసీ చేసినట్లు అయితే వెంటనే ఆ పైరసీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను జత చేస్తు..9393950505 / ఎపిసి50505@gmail.com ల వివరాలను తెలియజేయాలని ఆహా సంస్థ ప్రేక్షకులను కోరుకుంటుంది. అలాంటి వ్యక్తులు లేదా సంస్థలపై ఆహా వారు చట్టపరమైన సివిల్ క్రిమినల్ కేసులకు ద్వారా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆహ సీఈవో అజిత్ ఠాగూర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: