ఇంస్టా గ్రామ్ పోస్ట్ లు డిలీట్... ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన బుల్లితెర నటి?

VAMSI
బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో సోషల్ మీడియా ద్వారా పలకరిస్తున్న సీరియల్ నటి నిక్కీ శర్మ. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకు అంటే ససురాల్ సిమర్ కా, బ్రహ్మరాక్షస్ 2 లాంటి సీరియల్స్ లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. నటన పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నిక్కి శర్మ తన అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్న పోస్టులు అన్నీ డిలీట్ చేసింది. దీనితో అభిమానులు అంతా ఒక్కసారిగా ఆందోళనకు చెందారు.
పోస్టులను డిలీట్ చేయడమే కాదు, ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది. "నేను ప్రయత్నించాను.. కానీ అలసిపోయాను.. నా సొంత ఆలోచనల నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నాను" అని రాసుకొచ్చింది. మరి ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్ట్ చూసిన  ఆమె అభిమానులు అలాగే  సన్నిహితులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఎందుకు ఇలా  చేసింది అనే ఆలోచనలో   పడ్డారు. ఈ విషయంపై మాజీ సహ ఉద్యోగి అభిషేక్ భలే రావు స్పందించాడు.
పోస్టులను డిలీట్ చేయడం పట్ల అతను తన ఆందోళనను వ్యక్తం చేశాడు. తనతో పాటు ససురాల్ సిమర్ కా సీరియల్ లో కలిసి నటించిన నిక్కీ శర్మ తన పోస్టులను ఎందుకు తొలగించిందని, అలాగే ఆమె రాసిన మెసేజ్ స్టోరీలో 3 గంటలకు పైనే ఉండిపోయిందని, ఆయన ఈ మెయిల్ ద్వారా, తమ మ్యూచువల్ ఫ్రెండ్స్ తో ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా ఆమె రెస్పాండ్ కాలేదని తెలిపారు. అయితే నిక్కీ శర్మ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదని, ఆమె ఎందుకో నిరాశకు చెందినట్లు ఆమె స్నేహితులు నుంచి వచ్చిన సమాచారం అన్నట్లు  ప్రముఖ వెబ్ సైట్ తేల్చి చెప్పింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: