టీవీ: అనసూయ ఆ డైరెక్టర్ కి సెంటిమెంటా..?

Divya
బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ ద్వారా బాగా పరిచయమైంది యాంకర్ అనసూయ. ఇక బుల్లితెరపై ఈమె హవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. యాంకర్ గానే వ్యవహరిస్తూ తన డాన్స్ తో, మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది అనసూయ. ఇక వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలతో దూసుకు వెళుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ ద్వారా రంగమ్మత్త గా పరిచయం అయింది.

అంతేకాకుండా ఇటీవల కాలంలో సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రంలో కూడా ఈమె సునీల్ భార్యగా నటించింది. ఇక ఇందులో అనసూయ తన గెటప్ లతో ప్రేక్షకులను మైమరిపించేలా చేసింది. ఈ రెండు సినిమాలకి డైరెక్టర్ సుకుమారే దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో అనసూయ సుకుమార్ కు చాలా సెంటిమెంట్ గా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో సుకుమార్ తెరకెక్కించిన యాడ్ లో కూడా  నటించి మంచి హిట్ ను అందుకుంది. దీంతో ఈమె నటించడంతో నిజంగానే సుకుమార్ కి  సెంటిమెంట్ గా మారిపోయింది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక సుకుమార్ తనదైన స్టైల్లో అనసూయ , చిరంజీవి,  కుష్బూ లతో కలిసి ఒక విభిన్నమైన యాడ్ చిత్రీకరించారు. ఈ యాడ్ కూడా మంచి హిట్ కావడంతో సుకుమార్ కి అనసూయ సెంటిమెంట్ గా మారిపోయిందని తెలుస్తోంది. అందువల్లనే ఈ ముద్దుగుమ్మను ప్రతి సినిమాలో కూడా అవకాశం వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు గా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక చిరంజీవితో కూడా అనసూయ కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తపై సుకుమార్ -  అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: