టీవీ : కార్తీకదీపం భాగ్య డాన్స్ ..!

Divya
బుల్లితెరపై ఈ రోజున బిగ్ బాస్ -5 ముగిసింది ఈ రోజునా.. అందుకు సంబంధించి ఈవెంట్ కూడా కొన్ని గంటల ముందే ముగిసింది. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్ గురించి బాగానే లీకుల ద్వారా ఎవరు గెలుస్తారో కూడా తెలియజేయడం జరిగింది. ఇక చివరిగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్ గా చేశారో మనం చూసే ఉంటాము. ఇక ఈ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది అని చెప్పవచ్చు. చుట్టూ అమ్మాయిలతో నాగార్జున బాబి గర్ల్ అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున తన స్టెప్పులతో బాగా సందడి సందడి చేశారు.
ఇక ఈ షో ముగిసే సమయానికి బంగారు రాజు సినిమా నుంచి ఒక సరికొత్త పాట తో డాన్స్ వేశారు. నాగార్జున మాట్లాడుతూ ఒక మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని మాటిచ్చాము.. ఆ మాటనీ నేను నిలబెట్టుకున్నాననే తెలియజేశారు.ఇక అంతేకాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పేరు వచ్చిన నటి భాగ్యం కూడా తన డాన్సులతో బాగా అలరించింది... మొత్తానికి ఈ ఊపుడు బిగ్ బాస్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది.ఇక ఆ తరువాత ప్రియాంక, శ్వేతా లతో కలిసి జెస్సీ డాన్స్ వేయడం జరిగింది.
ఇక వీరందరి తర్వాత కాజల్ కూడా తనదైన స్టైల్ లో డాన్స్ తో అలరించింది. ఇక వీరితో పాటుగా చివరిగా ప్రియ, లహరి కూడా జాయిన్ కావడం జరిగింది. చిట్టచివరగా అనీ మాస్టర్, నటరాజన్ మాస్టర్లు కూడా తమ డాన్సులతో బాగానే స్టేజ్ పైన ఆకట్టుకున్నారు. ఇక వీరందరి స్టెప్పులు వేయడంతో అక్కడ కోలాహలంతో బాగా సందడి సందడి గా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఇక ఈ షోకి ఎందరో ప్రముఖులు రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: