టీవీ : కుంకుమపువ్వు సీరియల్ కిరణ్ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పలు టీవీ ఛానల్స్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయా ఛానల్స్ సీరియల్స్ తో పోటీ పడుతూ సక్సెస్ ఫుల్ గా ముందుకు నడుస్తున్నాయి. ఈ టీవీ , జెమినీ టీవీ , మా టీవీ, జీ టీవీ అంటూ ఎన్నో టీవీ ఛానల్స్ ఈ సీరియల్స్తో టిఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త కథతో రావడానికి దర్శకులు కూడా తమ మెదడుకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి.
స్టార్ మా ఛానల్ లో మధ్యాహ్నం పూట ప్రతి రోజు ప్రసారం అవుతున్న కుంకుమపువ్వు సీరియల్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇక పోతే ఈ సీరియల్లో హరిత, జాకీలకు కొడుకు గా నటిస్తున్న కిరణ్ ఈ సీరియల్ లో నెగిటివ్ రోల్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కిరణ్ అసలు పేరు సురేష్ చంద్ర. 12వ తేదీన తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జన్మించారు. డిగ్రీ పూర్తి చేసిన కిరణ్ విద్యాభ్యాసమంతా వరంగల్లోని పూర్తి చేయడం గమనార్హం.
కిరణ్ చదువుకునే రోజుల్లో ఎన్నో యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొని మంచి బహుమతులను కూడా గెలుచుకున్నాడు. ఇకపోతే సినిమాలతో తన కెరీర్ స్టార్ట్ చేసిన కిరణ్ ప్రణయ వీధుల్లో అనే మూవీలో హీరోగా కూడా నటించాడు.ఈ సినిమా  ద్వారా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కి అడుగుపెట్టిన కిరణ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , గోకులంలో సీత, సప్తమాత్రిక ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , మనసు మమత వంటి ఎన్నో సీరియల్స్ లో నటుడిగా పనిచేశాడు. ప్రస్తుతం కుంకుమ పువ్వు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: