టీవీ: వారికి ప్రతి నెలా డబ్బులు పంపిస్తానని హామీ ఇచ్చిన ఇంద్రజ..!

Divya
ఇంద్రజ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకుంది.. ఈమె ఇటీవల ఒక వృద్ధాశ్రమానికి ప్రతినెల అందులో ఉండే వృద్ధులకు , కావలసిన మాత్రలకు, వైద్యానికి డబ్బులు పంపిస్తాను అని హామీ ఇచ్చింది.. ఇక ఈమెతో పాటు మరో పలువురు నటీమణులు కూడా సహాయం చేయడం గమనార్హం.. అదేంటో ఇప్పుడు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం..

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ టీవీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ఈ షో లో జబర్దస్త్ లో నటిస్తున్న చాలామంది కమెడియన్లు , ఈ షో లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఇకపోతే ఈ  షోలో సుధీర్  యాంకర్ గా వ్యవహరిస్తుండగా, అందాల తార అలనాటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి ఇటీవల వృద్ధాశ్రమం నుంచి కొంత మంది వృద్ధులు వచ్చి, షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా వారు వారి కష్టాలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక వీరి కన్నీటిని చూసి తట్టుకోలేక ప్రముఖ కమెడియన్ వర్ష లక్ష రూపాయలను బహుమతిగా వారికి అందించింది. ఇక వీరితో పాటు జూనియర్ ఆర్టిస్టుగా ఇటీవల జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా తన వంతు ప్రయత్నంగా కమెడియన్ గా మారిన భాను కూడా వీరికి లక్ష రూపాయలను ఉచితంగా అందించింది. ఇద్దరు తమ సహృదాయాలను చాటి చెప్పారు. ఇకపోతే వారి బాధలను తెలుసుకున్న ఇంద్రజ... వారితో మాట్లాడుతూ.. అమ్మ మీ  మందుల కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది.. సుమారుగా లక్ష నుండి రెండు లక్షల రూపాయలు నెలకు అవుతాయని చెప్పారు.. అప్పుడు వెంటనే ఇంద్రజ.. మీరు  మీ అకౌంట్ నంబర్ ఇచ్చి వెళ్లండి.. ప్రతి నెలా నా అకౌంట్ నుండి మీ మందులకు కావాల్సిన డబ్బులు అందుతాయి.. అంటూ చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేశారు.
అంతే కాదు ఎవరికి ఎవరో అన్న కాలంలో.. ఇంద్రజ తనవంతు సహాయంగా ప్రతి నెల డబ్బులు పంపిస్తానని చెప్పడంతో.. ఆమె ఎంత మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: