బిగ్ బాస్ తెలుగులోకి ప్రతి సీజన్ లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంట్రీ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రియా అనే నటి ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రియా వయసు కాస్త ఎక్కువే అయినప్పటికీ చూడ్డానికి మాత్రం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరికంటే కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది. కుర్రాళ్లు కూడా ముందు నుండి ప్రియా ఆంటీకే జై అంటున్నారు. ఇక నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సరయు బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లేలాగా మాట్లాడడమే కాకుండా బిగ్ బాస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హౌస్ మేట్స్ పై సంచలన ఆరోపణలు చేసింది. హౌస్ లో ఎవరెవరు ఎలాంటి వాళ్లు....ఏం మాట్లాడుకుంటున్నారు. వాళ్ల స్టాటర్జీలు ఎలా ఉన్నాయి. ఇలా ఒక్కోటి చొప్పున అన్నీ బూతుల పాప భయటపెట్టింది.
ఇక ఈ నేపథ్యంలోనే ప్రియా పై కూడా సరయు సంచలన కామెంట్లు చేసింది. ప్రియా ఎప్పుడూ అందం గురించే మాట్లాడుతుందని సరయు చెప్పుకొచ్చింది. తనకు ఇంట్లో తానే అందంగా ఉన్నా అనే ఫీలీంగ్ ఎక్కువని ఇతరులు తనకంటే అందంగా ఉండరని ఉంటే తట్టుకోలేదని చెప్పింది. అంతే కాకుండా ఇతర సైజుల గురించి ఎప్పుడూ మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. పొట్టిగా ఉన్నారు పొడుగ్గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తుందనని సరయు వ్యాఖ్యానించింది. ఇక ప్రియాంక సింగ్ పైన కూడా సరయు అలాంటి కామెంట్లనే చేసింది.
ప్రియాంక సింగ్ లోకంలో ఉన్న మగవాళ్లు అంతా తననే చూడాలని అనుకుంటుందని సరయు చెప్పింది. మరోవైపు లోబో గురించి చెబుతూ అతడు చాలా మంచివాడని సరయు వ్యాఖ్యానించింది. అయితే ఇంట్లో లోబో ఇబ్బందులు పడుతున్నాడని..అతడిని కాలికింద చెప్పులా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. లోబోకు ఇంట్లో జరుగుతున్న అవమానాలను సిగరెట్ రూమ్ లోకి వచ్చి చెప్పుకుంటాడని సరయు చెప్పింది. ఇక చాలా మంది ఇంట్లో ఫేక్ గా ఉన్నారంటూ సరయు కామెంట్లు చేయడం ఆసక్తిరేపుతోంది. ఇక సరయు పేల్చిన బాంబులతో అరియానా నోరు కూడా తెరవకుండా అలానే ఉండిపోయింది.