బిగ్ బాస్ హౌస్ లోకి వీ.జే. సన్నీ ఎంట్రీ మామూలుగా లేదుగా..!

Divya
ఈరోజు ఇందాకే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్ లను ఒక్కొక్కరిని ఒక స్టైల్లో హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు నాగార్జున.. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఒక్కొక్కరిని గ్రాండ్ గా ఆహ్వానిస్తున్నారు అక్కినేని నాగార్జున.. కాకపోతే మొదటి ఎంట్రీగా భూమ్ బద్దల్ అనే పాట తో ఎంట్రీ ఇచ్చిన సిరి బాగానే ఆకట్టుకుంది. ఇక సైలెంట్ గా ఉండే వీ.జే.సన్నీ కూడా గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే వీ.జే. సన్నీ కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేయబోతున్నాడు కాబట్టి ,ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. బిగ్ బాస్ కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతున్నాడు.. అనే విషయాలను మనం తెలుసుకోవడానికి కొంత కాలం వేచి ఉండాల్సిందే..

ఇక డీజే సన్ని వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎక్కువగా తెలుగు ధారావాహికలలో మనం చూడవచ్చు. ఈయన 1989 సంవత్సరం ఆగస్టు 17 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని, ఖమ్మం జిల్లాలో జన్మించాడు.. ఈయన తండ్రి వెంకటేశ్వర్లు.. ఒక ప్రభుత్వ ఉద్యోగి..ఈయన తల్లి కళావతి అయితే  ఈమె డాక్టర్.. ఇక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడంతో, వీజే సన్నీ కూడా హైదరాబాదు లోని సెయింట్ మేరీస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు..

అయితే నటన మీద ఉన్న ఆసక్తితో ఈయన మొదట తన కెరియర్ ను వీడియో జాకీగా ప్రారంభించడం గమనార్హం.. ఆ తర్వాత మా మ్యూజిక్ ఛానల్ లో పలు షో లను కూడా నిర్వహించి , కొంత కాలం న్యూస్ ప్రజెంటర్ గా కూడా సన్నీ పని చేశాడు.. మొదటిసారిగా 2017 లో కల్యాణ వైభోగం అనే సీరియల్ ద్వారా తన నట జీవితాన్ని మొదలుపెట్టినా, తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందాడు. సన్నీకి ప్రయాణాలు చేయడం అంటే బాగా ఇష్టమట.. ఇక ఈయనకు ఒక సోదరి కూడా ఉంది.. ఆమె పేరు రజితా దేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: