టీవీ : బుల్లితెర స్టార్స్ జన్మస్థలం ఇదే..
బుల్లితెర పై టీవీ సీరియల్స్ తో పాటు వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ షో లు కూడా వచ్చాయి. అయితే ఆ ప్రోగ్రామ్స్ కోసం యాంకర్స్ కూడా చాలామంది పుట్టుకొచ్చారు. అందులో మొట్టమొదటగా మనకు గుర్తుకు వచ్చే యాంకర్స్ సుమ,ఝాన్సీ, ఉదయభాను. అప్పట్లో బుల్లితెరపై వీరు యాంకరింగ్ తో ఒక సంచలనం సృష్టించారు. ఇక వీరిలో కూడా ఎక్కువగా పాపులర్ అయింది సుమ మాత్రమే . ఇక ఆ తరువాత అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిని, శ్యామల ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యాంకర్స్ వచ్చారు. అయితే ఈ యాంకర్స్ ఎక్కడ పుట్టారో, వారి వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
సుమ:
సుమ కేరళకు చెందిన అమ్మాయి. ఈమె తెలుగు అబ్బాయి అయిన రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకొని , చాలాకాలంగా హైదరాబాద్ లోనే స్థిరపడింది.
ఉదయభాను:
ఉదయభాను చూడగానే తెలంగాణ బిడ్డ అని అర్థమవుతుంది. ఈమె కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ నుండి వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
శ్యామల:
కాకినాడ లో జన్మించి, హైదరాబాద్ లోనే సెటిల్ అయింది. అంతేకాదు బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించారు.
ఝాన్సీ:
ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది.
శ్రీముఖి:
బుట్ట బొమ్మ కు పెట్టింది పేరు శ్రీముఖి. ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులకు కనువిందు చేసే ఈ అమ్మడు నిజామాబాద్ లో పుట్టింది.
.
వర్షిని:
ప్రస్తుతం తన గ్లామర్ షోలతో అందరినీ ఆకట్టుకుంటున్న వారిలో వర్షిని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఈమె తమిళనాడుకు చెందినప్పటికీ తన కుటుంబంతో హైదరాబాదులోనే స్థిరపడింది.
విష్ణు ప్రియ:
ఈమె సొంత ఊరు ప్రకాశం జిల్లా. వాళ్ల నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కి రావడంతో అక్కడే సెటిల్ అయ్యారు.
అనసూయ:
ఇప్పుడు అనసూయ యాంకర్ గానే కాకుండా కొన్ని సినిమాలలో నటిస్తూ తన సత్తా ఏంటో చాటుతోంది. అంతేకాకుండా మరి కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్ లో నటించింది. ఈమె తెలంగాణలోని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం నుంచి వచ్చింది. ఈమె తండ్రిది తెలంగాణ, కానీ తల్లిది మాత్రం కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం. ఈమె యాంకర్ గా వచ్చి హైదరాబాద్ లోనే సెటిల్ అయింది.
రష్మి గౌతమ్:
రష్మిఅంటే తెలియకపోవచ్చు కానీ. సుధీర్ రష్మీ అంటే ఎవరికైనా తెలుసు. అంతలా పాపులర్ సంపాదించుకున్నారు ఈ ఇద్దరు. ఈమె ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించింది. అయితే ఈమె తండ్రి ఉత్తరప్రదేశ్ అలాగే తల్లి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్లు. కానీ ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం కి వచ్చి ,అక్కడే ఆమె చదువును పూర్తి చేసుకుంది.