బుల్లితెర: పుట్టిన రోజు నాడు అనసూయ ఏం చేసిందో తెలుసా?
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ ఛానెల్ ఈ ఛానెల్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఛానల్ లో ఏదో ఒక షో చేసి హాల్ చల్ చేస్తుంటుంది ఈ భామ. ఇంకా అలాంటి ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.. ఎవరైనా కామెంట్ చేస్తే అక్కడే తిట్టి పడేస్తుంది.
అలాంటి అనసూయ నిన్న పుట్టినరోజు జరుపుకుంది. ఇంకా ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఓ మంచి పని చేశారు.. 100 మంది గర్భిణీలకు ఆమె పండ్లు, గుడ్లు వంటి పోషకాహార కిట్ లను ఇచ్చారు. దీంతో రచ్చ కొండా పోలీసులు ఆమెను అభినందించారు.. ఇంకా రాచకొండ పోలీసుల సహకారంతో కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యం తీసుకుంటున్న గర్భిణీలకు అనసూయ పోషకాహార కిట్లను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనసూయ భర్త కూడా పాల్గొన్నాడు.
అంతేకాదు.. అనసూయ చేసిన ఈ మంచి పనిపై రాచకొండ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు.. ఇంకా ఆ ట్విట్ కి అనసూయ స్పందిస్తూ '' ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు అనుమతి ఇచ్చినందుకు థాంక్యూ సార్. ఇది నాకెప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మా అందరినీ సురక్షితంగా కాపాడుతోన్న పోలీసులు, వైద్య సిబ్బందికి మేం రుణపడి ఉంటాం'' అంటూ ట్విట్ చేసింది అనసూయ. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Thank you for allowing me Sir and for being there!! My best birthday ever!! Indebted to all the police and Medical personnel who are taking care of all of us during these pandemic times!! 🙏🏻#StayHomeSaveLives #StayHomeStaySafe #SocialDistancingWorks #QuarantineBirthday https://t.co/Wkx3tgG67x — anasuya Bharadwaj (@anusuyakhasba) May 15, 2020