ముంబై ఇండియన్స్ లో ఒకే ఒక్కడు.. బుమ్రా అరుదైన రికార్డ్?

praveen
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25లో MI (ముంబై ఇండియన్స్) వర్సెస్ LSG (లక్నో సూపర్ జెయింట్స్) మధ్య వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 45వ మ్యాచ్‌లో, ముంబై స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర లిఖించాడు. అవును... యావత్ ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ విషయంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగను వెనక్కి నెట్టి ఈ మైలురాయిని అందుకోవడంతో సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

141 ఇన్నింగ్స్‌లలో బుమ్రా 174 వికెట్లు తీసి మలింగ(170 వికెట్లు, 137 ఇన్నింగ్స్‌లలో) రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్ 127 వికెట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. లక్నో ఇన్నింగ్స్‌లో 3వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా మొదటి ఓవర్ నుండే విజృంభించాడు. మిడిల్, లెగ్ స్టంప్ వైపు వేసిన బ్యాక్-ఆఫ్-లెంగ్త్ బంతిని ఐడెన్ మార్క్రమ్ ఫ్లిక్ చేయబోయి, లోపలి అంచుని తాకించడంతో, బంతి నేరుగా బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వద్ద నమన్ ధీర్ చేతికి చేరింది. ఈ క్యాచ్‌ కారణంగా ముంబైకు కీలకమైన వికెట్ దక్కినట్టు అయింది. ఎందుకంటే మార్క్రమ్ లక్నో జట్టులో అత్యధిక స్కోరర్లలో ఒకడు.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ జట్టుకు మంచి ఊతం ఇచ్చారు. అయితే, మయాంక్ యాదవ్ తిరిగి ఐపీఎల్‌లో ప్రవేశించి రోహిత్ శర్మను కేవలం 12 పరుగులకే పెవిలియన్‌కి పంపించాడు. ఆ తరువాత ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. రికెల్టన్ 32 బంతుల్లో 58 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీగా 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు సాధించారు. మొత్తంగా ఈ మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా చరిత్రలో నిలిచిపోయే రోజుగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. బుమ్రా చూపించిన స్థిరమైన ఫామ్, కీలక సమయంలో వికెట్లు తీసే నైపుణ్యం అతనిని ముంబై విజయాలలో కీలక ఆటగాడిగా నిలిపాయి అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: