టీమిండియాకు టెన్షన్‌..WTC కోసం ఇంకా ఎన్ని మ్యాచ్‌ లు గెలవాలంటే ?

Veldandi Saikiran
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం రోజున ముగిసిన తొలి టెస్ట్ లో రోహిత్ సేన 280 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆదిక్యంలో నిలబడింది. 8 నెలల సుదీర్ఘ విరామం అనంతరం టెస్ట్ క్రికెట్ ఆడిన టీమిండియా....విజయంతో రెడ్ బాల్ ఫార్మాట్ ను ప్రారంభించింది.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే తన తొలి టెస్ట్ మ్యాచ్ కాగా.... ఈ విజయంపై అతను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా 6 పదాల్లోనే తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత విజయానికి సంబంధించి ఇన్ స్టా వేదికగా రెండు స్టోరీలు పంచుకున్నారు గంభీర్.  మైదానంలోకి అడుగుపెడుతున్న ఆటగాళ్ల ఫోటోను, ఒకటి ఆట మధ్యలో ఆటగాళ్లు సమావేశమైన మరొక ఫోటోను జత చేసి పోస్ట్ చేయడం జరిగింది గంభీర్.

ఇదిలా ఉండగా.... ఐసీసీ నివేదిక ప్రకారం, WTC ఫైనల్స్ కు అర్హతను సాధించాలంటే టీం ఇండియా రాబోయే తొమ్మిది మ్యాచుల్లో కనీసం 6 మ్యాచ్లను గెలవాలి. ఇందులో బంగ్లాదేశ్ తో ఒక టెస్టు మ్యాచ్ ను, న్యూజిలాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్ లను భారత్ తన సొంత మైదానంలో ఆడబోతోంది. ఆ తర్వాత జట్టు విదేశీ గడ్డపై అంటే ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.

ఫైనల్ చేరాలంటే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్-2లో కచ్చితంగా ఉండాలి. తద్వారా ఐదు మ్యాచ్లు గెలిచిన ఒక మ్యాచ్ డ్రా చేసుకున్న భారత్ కు ఫైనల్ టికెట్ దక్కుతుంది. డబ్ల్యుటిసి ఫైనల్స్ కు గట్టి పోటీ ఇస్తున్న ఆస్ట్రేలియా పాయింట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్లు గెలవాలి లేదా మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: