ఎన్నో రోజులు బాధపడ్డా.. అది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ : ధోని

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న టీమిండియాకు గత కొన్నేళ్ల  నుంచి వరల్డ్ కప్ గెలవడం అనేది అటు అందని ద్రాక్ష లాగే మారిపోయింది. ఎంతమంది కెప్టెన్లు మారినప్పటికీ  జట్టుకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న జరిగిన 2024 t20 వరల్డ్ కప్ లో మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. అద్భుతమైన విజయాన్ని సాధించి.. టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఇక వరల్డ్ కప్ గెలవాలి అనే కలను సహకారం చేసుకుంది అని చెప్పాలి.



 అయితే గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి కూడా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత పని చేసింది. కానీ చివర్లో తడబడి చివరికి ఇక అభిమానులను నిరాశపరిచింది. మరీ ముఖ్యంగా 2019 వరల్డ్ వరల్డ్ కప్ లో అటు న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ధోని రన్ అవుట్ అయిన ఘటనను ఎప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఈ రన్ అవుట్ ఘటన భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఇక ఎంతోమంది ప్రేక్షకులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వద్దన్నా గుర్తుకు వచ్చే ఒక చేదు జ్ఞాపకంగా ఇలా సెమీఫైనల్ లో ధోని రన్ అవుట్ మిగిలిపోయింది.


 అయితే ఈ రన్ అవుట్ పై తాజాగా మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించారు. తన చివరి వరల్డ్ కప్ లో అలాంటి ముగింపు తనను ఎంతగానో బాధకి గురిచేసింది అంటూ మహేంద్రసింగ్ ధోని చెప్పుకొచ్చాడు. అది నిజంగా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్.. దాని నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది అంటూ మహేంద్రుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అటు వెంటనే ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండడంతో.. చివరికి ఆ ఘటన ఇచ్చిన బాధ నుంచి బయట పడేందుకు సమయం దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు ధోని. అయితే ఇలా రన్ అవుట్ అయిన తర్వాత డగౌట్ చేరుకుంటున్న సమయంలో ధోని కన్నీళ్లు పెట్టుకున్నా ఘటన అభిమానులను సైతం కన్నీళ్లు పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: