ఫ్యాన్స్ కి పండుగ లాంటి న్యూస్.. రాహుల్ ద్రావిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు?

praveen
సినీ రాజకీయ రంగాలలో ఈ మధ్యకాలంలో వారసులదే హవా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారి వారసులు అటు మళ్ళి నటులుగా ఇండస్ట్రీకి పరిచయమై.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. భారీ బ్యాగ్రౌండ్తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక తర్వాత తమ సినిమాల ద్వారా తండ్రిని మించిన తనయులుగా  గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక రాజకీయాల్లోనూ ఇదే ట్రెండు కొనసాగుతుంది. ఎంతో మంది సీని యర్రాజకీయ నాయకుల పిల్లలు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 అతి తక్కువ సమయం లోనే రాజకీయాలలో రాణిస్తూ ఇక పెద్దపెద్ద పదవులు కూడా చేపట్టడం నేటి రోజుల్లో అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే క్రీడారంగంలో మాత్రం భారత క్రికెట్లో ఇలా వారసులు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. క్రికెట్ దేవుడు సచిన్ వారసుడుగా అర్జున్ టెండూల్కర్ క్రికెట్ వైపే అడుగులు వేసిన ఇప్పటికీ కూడా అతను టీమ్ ఇండియాలో అడుగుపెట్టలేకపోయాడు. అయితే ఇక ఇప్పుడు మరో లెజెండరీ క్రికెటర్ వారసుడు ప్రొఫెషనల్ క్రికెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కాదు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్. ప్రస్తుతం ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ టి20 లీగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు  కర్ణాటక మహారాజా ట్రోఫీ లీగ్ లో ఆయన మైసూర్ వారియర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సమిత్ ద్రవిడ్ ను 50 వేల రూపాయలకు మైసూర్ వారియర్స్ జట్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా కరుణ్ నాయర్ వ్యవహరించబోతున్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో లెజెండ్ గా ఎదిగిన రాహుల్ ద్రవిడ్ కొడుకుగా అటు క్రికెట్లోకి అడుగుపెడుతున్న సమిత్ ఎంత మేరకు తండ్రిని మరిపించగలడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: