రోహిత్ శర్మ కోసం నా ఆస్తులు రాసిస్తా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

Veldandi Saikiran
ముంబై ఇండియన్స్ లాస్ట్ సీజన్ లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంపై కాస్త అసంతృప్తిగా ఉన్నటువంటి రోహిత్ ఈ వేలంలో ముంబై ఇండియన్స్ టీమ్ ను వీడడం దాదాపుగా ఫిక్స్ అని ప్రచారం జరుగుతోంది. ఇక ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 6వేల పరుగుల మైల్డ్ స్టోన్లు అందుకున్న ఆటగాడిగాను రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది.
ఇక ఇలాంటి అద్భుతమైన ఆటగాడిని తమ టీమ్ లో చేర్చుకోవాలని ప్రతి ఒక్క టీమ్స్ చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా సరైన కెప్టెన్ లేక బాధపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జేయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు రోహిత్ శర్మను వేలంలో కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మూడు జట్లు రోహిత్ శర్మను కొనుగోలు చేసుకోవడానికి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. లక్నో జట్టును కేఎల్ రాహుల్ వీడనున్నారు.
ఇక అతని స్థానంలో ఓపెనర్, కెప్టెన్సీ స్థానాలను భర్తీ చేయడానికి రోహిత్ శర్మ వైపు లక్నో టీం మేనేజ్మెంట్ చూస్తోంది. రిషబ్ పంత్ ను వదిలివేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక మంచి కెప్టెన్ కావాలని చూస్తోంది. ఇక పంజాబ్ కింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ లో కెప్టెన్ ను మారుస్తుంది. గతేడాది శ్యామ్ కరణ్, అంతకుముందు శిఖర్ ధావన్ ఇలా ఎవ్వరూ కూడా సక్సెస్ఫుల్ కెప్టెన్ కాలేకపోయారు.
ఇక పంజాబ్ కింగ్స్ కూడా రోహిత్ శర్మ వైపు చూస్తోంది. ఆ మధ్యకాలంలో ప్రీతి జింటాను రోహిత్ శర్మ వేలంలోకి వస్తే మీరు కొనుగోలు చేస్తారా అని రిపోర్టర్స్ అడిగారు. ఆ ప్రశ్నకు ప్రీతి జింటా.... రోహిత్ శర్మ వేలంలోకి వస్తే నా ఆస్తినంతా అక్కడ పెట్టి అతడిని కొనుక్కుంటానని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఈ మూడు టీమ్స్ వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి పెద్ద యుద్దమే చేయనున్నట్లుగా కనిపిస్తోంది. ఇక రోహిత్ శర్మను ఏ జట్టు కొనుగోలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: