షాక్: నటాషా- హార్దిక్ పాండ్యా విడాకులు కన్ఫామ్.. వైరల్ గా పోస్ట్..!

Divya
గత కొద్దిరోజుల నుంచి టీమిండియా ప్లేయర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య అయిన నటాషా విడిపోతున్నారనే వార్తలు కొద్ది రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ ను నిజం చేస్తు హార్దిక్ పాండ్యా ,నటాషా ఇద్దరూ కలిసి సోషల్ మీడియా వేదికగా తాము డివర్స్ తీసుకునే విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా మరి వీటి గురించి పూర్తిగా చూద్దాం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ ఇద్దరు కూడా విడిపోతున్నామనే విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత నటాషా ఇంకా నేను పరస్పరా అంగీకారంతోనే విడిపోలని తేల్చుకున్నామంటూ రాసుకొచ్చారు హార్దిక్ పాండ్యా.. ఈ విషయాన్ని కూడా నటాషా కూడా రాసుకు వచ్చింది.ముఖ్యంగా మా ఇద్దరి జీవితాలలో ఇది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా తప్పడం లేదు అంటూ తెలియజేశారు. తామిద్దరము విడిపోయిన మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను ఇద్దరు కూడా తల్లితండ్రులుగానే కొనసాగిస్తామంటూ తెలియజేశారు. అతడిని సంతోషంగా ఉంచడం కోసం ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధమే అంటూ కూడా తెలియజేశారు. ఇలాంటి సమయంలో మా విషయాన్ని గౌరవిస్తారని మద్దతుగా నిలవాలని అభిమానులను కోరుకుంటున్నారు.

నటాషా తన ఇంస్టాగ్రామ్ లో పాండ్యా ఇంటిపేరుతో పాటు తమ పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య రూమర్స్ సైతం ఎక్కువగా వినిపించాయి. టి20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన తర్వాత నటాషా తీరు పైన చాలామంది ఆగ్రహాన్ని తెలిపారు.. అలాగే ఇటీవల జరిగిన అనంత అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో కూడా హార్దిక్ పాండ్యా ఒంటరిగానే హాజరు కావడం జరిగింది... దీంతో ఈ విడాకులు రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. అలాగే నటాషా ఇటీవల తన కుమారుడు అగస్త్యను తీసుకొని మరి తన సొంత దేశానికి వెళ్లిపోవడంతో విడాకుల మాట నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఇలా అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: