టీమిండియా కు కొత్త కెప్టెన్.. తెరపైకి ఎవరూ ఊహించని పేరు..?

Pulgam Srinivas
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. కొన్ని రోజుల క్రితమే టీం ఇండియా జట్టు టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొంది. ఇక ఇందులో మొత్తం మన దేశం 8 మ్యాచ్ లను ఆడగా , అందులో 8 గెలిచి టీ 20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలో భారత జట్టుకు వరల్డ్ కప్ దక్కింది. ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకమైన టీ 20 వరల్డ్ కప్పును సొంతం చేసుకున్న తర్వాత భారత జట్టు జింబాబ్వే తో టీ 20 సిరీస్ లో తలపడింది.

ఇక జింబాబ్వే తో టీ 20 సిరీస్ అనగానే కచ్చితంగా దానిని భారత్ గెలుస్తుంది అని మొదటి నుండి భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తూ వచ్చారు. అలాంటి ఫలితమే వచ్చింది. భారత జట్టు ఏక పక్షంగా ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా ట్ 20 జట్టుకు కెప్టెన్ గా ఎవరిని నియమించాలి అనే దానిపై (బీ సీ సీ ఐ) చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఒక పేరును అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీ 20 టీమిండియా జట్టుకు కొత్త కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కి బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో (బీ సీ సీ ఐ) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా పేరు టీ 20 టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్ గా అనుకున్న టీ 20 ప్రపంచ కప్ గెలుపుతో రోహిత్ శర్మ ఈ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పేసాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా సిరీస్ లకి కెప్టెన్ గా వ్యవహరించిన సూర్య కే మల్లి టీ 20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని (బీ సీ సీ ఐ) ఆలోచిస్తున్నట్లు ప్రస్తుతం ఓ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: