పేరుకేమో ధోని శిష్యుడు.. కానీ ఏం చేశాడో చూడండి?

praveen
భారత క్రికెట్ లో ఎంతోమంది యంగ్ ప్లేయర్లకు ధోని శిష్యులుగా పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు ధోని తమకు ఇచ్చిన మెలకువలను సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ధోని ఇచ్చిన సలహాల కారణంగానే తమ కెరియర్ మలుపు తిరిగింది అని ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ చెబుతూ ఉంటారు. ఇలా ధోని శిష్యుడుగా పేరు సంపాదించుకున్న వారిలో సీఎస్కే ప్లేయర్ శివం దూబే కూడా ఒకరు.

 ఈ ఆటగాడు ఈసారి ఐపీఎల్ సీజన్లో సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం అంతా ఇంతకాదు. ఏకంగా ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇక తాను ధోని శిష్యుడు అని చెప్పుకుంటూ ఉంటాడు శివం దూబే. ఇలా ధోని శిష్యుడిని అని చెప్పుకునే శివం దూబే ఇక ఇటీవల చేసిన పని మాత్రం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మూడో ఓవర్లో మహమ్మద్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ ను శివం దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంత్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా బంతి డీప్ ఫైన్ లెగ్ లోకి వెళ్ళింది.

 దీంతో అక్కడే ఫీలింగ్ చేస్తున్న దూబే ఎంతో సింపుల్ గా క్యాచ్ పట్టాల్సింది. ఏకంగా చేతుల్లోకి క్యాచ్ వచ్చిన లడ్డు లాంటి క్యాచ్ ని సైతం దూబే జార విడిచాడు. దీంతో ఫాన్స్ అందరు కూడా ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దూబేకి బదులు అభిషేక్ శర్మను తీసుకొని ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే దూబే బ్యాటింగ్ లో కూడా విఫలమవుతున్నాడు. అయితే ధోని శిష్యుడు అని చెప్పుకునే అతను ఇలా చేయడం ఏంటని మరి కొంతమంది సి ఎస్ కే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: