ఆయన వల్లే.. వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యా : శివం దూబే

praveen
ఈ మధ్యకాలంలో టీమిండియాలో చోటు కోసం ఎంతలా పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో చోటు సంపాదించుకోవాలంటే మిగతా ప్లేయర్లతో పోల్చి చూస్తే ఏదో కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా కొత్తగా నిరూపించుకున్న తర్వాత కూడా తప్పకుండా టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు.

 కొంతమంది యంగ్ ప్లేయర్లకు ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సరైన అవకాశాలు రాక డీల పడిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సీఎస్కే ప్లేయర్ శివం దూబే లక్కీగా టి20 వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కడానికి వెనుక ఉన్న కారణం ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈ యువ ఆటగాడు. కెరియర్ మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీనే ప్రధాన కారణం అంటూ ఆల్రౌండర్ శివం దుబే తెలిపాడు. ధోని గైడ్లైన్స్ లో ఐపీఎల్ ఆడటం తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు.

 ఇక ధోని ఇచ్చిన మెలకువలతోనే బాగా రాణించానని.. అందుకే టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కింది అంటూ తెలిపారు. ధోని కారణంగా తన ఆత్మవిశ్వాసం పెరిగిందని.. నా రీ ఎంట్రీలో మహేంద్రసింగ్ ధోనిభాయ్ బై పాత్ర కీలకమని తెలిపాడు. లెజెండరీ ప్లేయర్ సలహాలు ఏ ఆటగాడికైనా ఉపయోగపడతాయి. ఏదైనా సానుకూలంగా చెబితే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నా విషయంలోనూ ఇదే జరిగింది. ఐపీఎల్ లో నాకు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఒకే ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాను. అది నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా నేను మాత్రం ప్రాక్టీస్ ఆపలేదు అంటూ శివం దూబే చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: