ప్రస్తుత "ఐ పీ ఎల్" సీజన్ లో మంచి ప్రదర్శనను కనబరుస్తున్న టీమ్ లలో లక్నో టీం ఒకటి. వీరు ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లను అడగా అందులో రెండింటిలో గెలుపొంది కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయారు. దానితో వీరు పాయింట్లు పట్టికలో ప్రస్తుత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మంచి దశలో కొనసాగుతున్న ఈ టీం కు ఓ పెద్ద షాక్ తగిలింది. అసలు విషయం లోకి వెళితే ... లక్నో జట్టు శివ మావి అనే యంగ్ బౌలర్ ను 6.4 కోట్ల భారీ వ్యయం తో దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇంత ధర పెట్టి కొనుక్కున్న ఈ ప్లేయర్ పై ఈ జట్టు బారి ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ టీం కు శివం ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈయనను బరిలోకి దింపాలి అని ఈ టీం భావించింది. కానీ ఇంతలోనే ఈయనకు గాయం అయ్యింది. దానితో రాబోయే మ్యాచ్ లో కూడా శివం మావి మ్యాచులు ఆడడు అని తెలియజేస్తూ లక్నో టీం వారు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఈ ప్లేయర్ ఈ సీజన్ లో తదుపరి మ్యాచులు కూడా ఆడడు అనే విషయాన్ని లక్నో టీం ప్రకటించడంతో ఈ జట్టు అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే నిన్న రాత్రి లక్నో టీం బెంగళూరు తో మ్యాచును ఆడింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్ లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 19.4 ఓవర్లు ముగిసే సరికి ఆల్ అవుట్ అయ్యి 153 పరుగులు మాత్రమే చేసింది. దీనితో నిన్నటి మ్యాచ్ తో లక్నో కు భారీ విజయం దక్కింది.