ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితున్ని పోలీసులు ఎలా చంపారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే మనుషులు మనుషుల్లా ఉండడం లేదు. ఏకంగా మృగాలుగా మారిపోయి ప్రవర్తిస్తున్నారు. పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తైనా జాలి దయ చూపించడం లేదు. వెరసి ఇలా మృగంగా మారిపోతున్న మనుషులను చూసి సభ్య సమాజంలో ప్రశాంతంగా బ్రతకగలమా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి.

 అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే క్రూరంగా మనిషి ప్రవర్తన తీరు మారిపోయింది అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకి ఏకంగా మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక ఏ క్షణంలో ఎవరు ఎటువైపు నుంచి దాడి చేసీ ప్రాణాలు తీస్తారో అని అందరూ ప్రతిక్షణం భయపడుతూనే బ్రతికేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్లో  సభ్య సమాజం ఉలిక్కిపడే ఘటన జరిగింది. రాజధాని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా బాబా కాలనీలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న 12, 8 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు అన్నదమ్ములను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

  చిన్నారుల గొంతు నలిమి అత్యంత కర్కశంగా ప్రాణాలు తీసేసాడు. అంకుల్ ప్లీజ్ మమ్మల్ని చంపకండి అంటూ ఆ పిల్లలు బ్రతిమిలాడుతున్న అతని మనసు కరగలేదు. చివరికి దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇది గమనించిన స్థానికులు కోపోద్రిక్తులై.. చివరికి అతని దుకాణానికి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. చివరికి నిందితుడిని ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. ఇలా చిన్నారులను చంపిన నిందితుడు కూడా స్థానికుడుగానే గుర్తించారు పోలీసులు. హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: