షాకింగ్ ఆఫర్.. పిల్లల్ని కనండి.. రూ.25 లక్షల సంపాదించండి?

praveen
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ప్రపంచ నలుమూలల్లో చీమ చిటక్కుమన్నా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో క్షణాల వ్యవధిలోనే వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని దేశాలలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటూ ఉంటారు ఇంటర్నెట్ జనాలు.  ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది.

 మన దేశంలో జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం ఎంతలా చర్యలు చేపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లపై అందరికీ అవగాహన కల్పిస్తూ.. ఇక కేవలం ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలను కనకుండా అందరిలో మార్పు తీసుకువస్తుంది. కానీ ఇతర దేశాలలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఏకంగా జననాల రేటు విపరీతంగా తగ్గిపోవడంతో.. పిల్లలను కంటే ఏకంగా బహుమతులు ఇచ్చేందుకు కూడా అక్కడికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి.

 ప్రస్తుతం చైనాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ జననాల రేటు అంతకంతకు తగ్గిపోతూ ఉండడంతో అక్కడి ప్రభుత్వాలు పిల్లలను కనేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంది. అయితే ఇటీవల అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీ ఇలాంటి ఆఫర్ ని ప్రకటించింది . పిల్లలను కనండి.. డబ్బులు సంపాదించండి అంటూ చైనాలోని హెరైన్ ప్రావిన్స్ కు చెందిన హౌస్ కీపింగ్ కంపెనీ మహిళల కోసం ఇచ్చిన ప్రకటన కాస్త సంచలనంగా మారిపోయింది. 28 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు.. సరోగేట్ ద్వారా తల్లులుగా మారి దాదాపు 25 లక్షల పైన సంపాదించవచ్చు అంటూ సదరూ కంపెనీ పేర్కొంది. 29 నుంచి 30 ఏళ్ల వరకు ఇలా సరోగేట్ ద్వారా పిల్లలను కంటే 23 లక్షలు, 40 నుంచి 42 ఏళ్ళ వారికి 19 లక్షలు సంపాదించవచ్చు అంటూ తెలిపింది. అయితే చైనాలో సరోగసి చట్ట విరుద్ధం కావడంతో ఈ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: