ఢిల్లీ క్యాపిటల్స్ కి బిగ్ షాక్.. పంత్ వస్తున్నాడు.. కానీ అతను దూరం?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ గురించి చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ టి20 టోర్ని చూసి ఎంజాయ్ చేసేందుకు క్రికెట్ ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక ఆటగాళ్లు తమ జట్టును గెలిపించేందుకు వీరోచితంగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు అని చెప్పాలి. అయితే వేలంలో భారీ ధర పెట్టి జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లతో ఇక ఈసారి సూపర్ పర్ఫామెన్స్ చేయాలని అన్ని జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయ్.

 ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఊహించని ఎదుటి దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్లకు మాత్రమే దూరమవుతుంటే.. ఇంకొంతమంది ఆటగాళ్లు గాయంతో టోర్నీ మొత్తానికి కూడా దూరం అవుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది.

 దాదాపు రెండు సీజన్ల తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది  ఏకంగా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతాడు అనుకున్న హ్యారి బ్రూక్ చివరికి దూరమైనట్లు తెలుస్తుంది. అతని స్థానంలో ఆస్ట్రేలియా యంగ్ సెన్సేషన్ జాక్ ప్రెజర్ మెక్ గుర్క్ ని తీసుకున్నట్టు సమాచారం. అయితే వ్యక్తిగత కారణాలతో బ్రూక్ ఐపీఎల్ కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ కి కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ తప్పుకున్నాడు. కాగా ఐపీఎల్ వేలంలో ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఏకంగా అతన్ని జట్టులోకి తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: