రోహిత్ నాకోసం.. ఎవరు చేయని పని చేశాడు : అశ్విన్
అయితే ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా ఇలా టెస్ట్ సిరీస్ ఆడుతున్న సమయంలో.. జట్టులో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పుకొని ఇంటికి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెంటనే అతను ఇంటికి చేరుకున్నాడు ఇక ఆ తర్వాత తల్లి ఆరోగ్యం కుదుటపడిన వెంటనే.. మళ్ళీ జట్టులో వచ్చి చేరిపోయాడు. అయితే ఇలా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన సమయంలో.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్న విషయాన్ని ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
తన తల్లి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయింది అన్న విషయం తెలియగానే తాను నిల్చున్న చోటనే కుప్పకూలిపోయాను అంటూ రవిచంద్రన్ అశ్విని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ధైర్యం చెప్పాడని.. తన రూమ్ లోనే ఫిజియోని ఉంచి ఎప్పటికప్పుడు తన బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ వార్త తెలియగానే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని ఏడుస్తూనే ఉన్నా ఇక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేందుకు మొబైల్ లో వెతుకుతున్న. ఆ సమయంలో రోహిత్ నా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి.. నా కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసి చెన్నైకి పంపించాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.