హార్దిక్ పాండ్యాకు డబ్బే ముఖ్యం.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. తన ఆటతీరుతో ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే గత కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో టీం ఇండియాకు అందుబాటులో ఉన్న సమయం కంటే గాయంతో జట్టుకు దూరమైన సమయమే ఎక్కువగా ఉంటుంది. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యాడు హార్దిక్ పాండ్యా. ఇక ఆడిన మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేశాడు. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతను గాయం బారిన పడ్డాడు.

 దీంతో ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి కూడా దూరం అయిపోయాడు హార్దిక్ పాండ్యా. అయితే కేవలం వరల్డ్ కప్ కి మాత్రమే కాదు ఆ తర్వాత టీమ్ ఇండియా ఆడిన ఏ మ్యాచ్ కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతని తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వరల్డ్ కప్ సమయంలో దూరమైన తర్వాత హార్దిక్ కనీసం దేశవాళి క్రికెట్ కి కూడా అందుబాటులో లేడు. కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే ఇప్పుడు ఆడెందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు ఏకంగా దేశం రాష్ట్రం తరఫున ఆడటం కంటే డబ్బే ముఖ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ ప్లేయర్ ప్రవీణ్ కుమార్. దేశం, రాష్ట్రం కోసం ఆడటానికి హార్దిక్ పాండ్యా పెద్దగా ఇష్టపడడు. కానీ డబ్బు కోసం ఐపీఎల్ ఆడటానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. డబ్బు మాయలో పడి దేశం రాష్ట్రాన్ని వదిలేయడం భావ్యం కాదు అంటూ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రవీణ్ కుమార్ ఆరోపణలు నిజమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. గాయపడిన పడిన తర్వాత ఎలా క్రికెట్ కి అందుబాటులో ఉంటారు అంటూ ఇంకొంతమంది హార్దిక్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: