ఈసారి ఐపీఎల్ లో.. అతిపిన వయస్కుడు ఇతడే?

praveen
మరో తొమ్మిది రోజుల్లో ఇండియాలో క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది  ఈ క్రమంలోనే మరోసారీ తమ జట్టుకు మద్దతుగా నిలిచి ఇక టైటిల్ విజేతగా నిలిపేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అభిమానులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో అన్ని ఫ్రాంచైజీలు  కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఇక అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి.

 ఇక మరోవైపు ఎప్పటిలాగానే క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా ఈసారి 17వ సీజన్లో టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై ఇక రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. అయితే ఇక ఈసారి ఐపీఎల్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా ఎంట్రీ ఇచ్చే ఆటగాళ్ల స్పెషాలిటీ ఏంటి ఇక వాళ్ళ వయసు ఎంత అన్న విషయాలు కూడా తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఐపీఎల్ అంటేనే యంగ్ ప్లేయర్ల ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ 17వ ఐపీఎల్ సీజన్లో ఇక పాల్గొనబోయే అతిపిన్న వయస్కుడైన ఆటగాడు ఎవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఆరవెల్లి అవినాష్ రావు ఇక ఈ ఐపిఎల్ సీజన్లో పాల్గొనబోయే అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించబోతున్నాడు. ఎందుకంటే అతని వయసు ప్రస్తుతం కేవలం 18 ఏళ్లు మాత్రమే కావడంగమనార్హం. అతని తర్వాత స్థానంలో స్వస్తిక్ షికార 18, అంగు క్రిష్ రఘువంషి 19, హర్షిన్ కులకర్ణి 19, నూరు అహ్మద్ 19, నితీష్ కుమార్ రెడ్డి 20, డివాల్ట్ బ్రేవిస్ 20, కునాల్ సింగ్ రాథోడ్ 21,  రాహుల్ చౌహాన్ 23 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. ఇలా ఈ ప్లేయర్లందరూ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో అతిపిన్న వయస్కుడిగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: