కోహ్లీ అందుకే లీవ్ తీసుకున్నాడు.. హర్ష గోయేంకా హింట్ ఇచ్చేసాడుగా?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ఇక ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు టెస్టులను ముగించుకుని.. ప్రస్తుతం రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ తో తలపడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఎప్పుడు టీమిండియా కు మూడు ఫార్మాట్ లకు అందుబాటులో ఉండే విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఎంతో కీలకమైన టెస్ట్ సిరీస్ కి మాత్రం దూరంగానే ఉన్నాడు.

 అయితే విరాట్ కోహ్లీ గాయం బారిన పడి ఇలా జట్టుకు దూరమై ఉంటే అంతగా చర్చ జరిగేది కాదేమో.. కానీ వ్యక్తిగత కారణాలతో అతను టీమిండియాకు దూరంగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ ఇలా దూరంగా ఉండడానికి గల వ్యక్తిగత కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాలేదని కొన్ని రోజులు.. వార్తలు వచ్చాయి. ఇక కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ అతని స్నేహితుడు ఏబీడీ చెప్పి.. మళ్లీ అదంతా అబద్ధం అంటూ ఇచ్చాడు.

 దీంతో ఇంకా విరాట్ కోహ్లీ నిజంగా ఎందుకు సెలవులు తీసుకున్నాడు అనే విషయంపై అందరిలో మరింత ఆసక్తి పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై స్పందించిన ప్రముఖ వ్యాపారవేత హర్ష గోయాంక ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ఒకరకంగా కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని చెప్పకనే చెప్పాడు హర్ష గోయంక. ఎవరు లండన్ లో ఒక బిడ్డ పుట్టబోతుంది.. తండ్రి లాగా క్రికెటర్ అవుతుందా.. లేదా తల్లీ లాగా సినీ సెలబ్రిటీ అవుతుందా అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఇది అనుష్క, కోహ్లీ దంపతులను ఉద్దేశించే పెట్టాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: