భారత జట్టుకు మరో బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?

praveen
భారత జట్టును గాయాలు బెడతా గత కొంతకాలం నుంచి తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక కీలకమైన సిరీస్ లకు ముందు జట్టులో ఉన్న ప్రధాన ప్లేయర్లందరూ కూడా గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ సమయంలో గాయం బారిన పడిన మహమ్మద్ షమీ లాంటి ప్రధాన బౌలర్ ఇక ఇప్పటికీ కూడా టీమ్ ఇండియాకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు కూడా గాయం బారిన పడి ఇక రెండో టెస్టు మ్యాచ్ కి దూరమయ్యారు.

బుమ్రా కూడా గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులోకి ఉంటాడా లేదా అన్నది అనుమానం గానే మారిపోయింది. అయితే టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందే రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్ కూడా జట్టుకు దూరమయ్యాడు అని చెప్పాలి. ఇలా వరుసగా కీలకమైన ఆటగాళ్లు గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతుండడంతో.. టీమ్ ఇండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయి రెండో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా.. తర్వాత మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

 ఇలాంటి సమయంలో భారత్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు దూరం కాబోతున్నాడట. ఇటీవల అతనికి గాయం అయినట్లు క్రీడా వర్గాల నుంచి సమాచారం  అయితే అతను వెన్ను, గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నాడని తెలుస్తుంది  ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన మూడు టెస్ట్ లకు కూడా శ్రేయస్ అయ్యర్ దూరం కాబోతున్నాడట. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే శ్రేయస్ అయ్యర్ దూయమైతే అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: