ప్యూమాకు గుడ్ బై చెప్పేసిన కోహ్లీ.. కొత్త బ్రాండ్ పట్టేసాడుగా?

praveen
టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా వరల్డ్ క్రికెట్లో రన్ మెషిన్ అనే ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. రికార్డుల రారాజు అని కూడా కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు అతని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలి అనుకునే ఆటగాడిలో కనిపించే కసి.. విరాట్ కోహ్లీలో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది  ఇక ప్రత్యేకమైన ఆట తీరే.. అతన్ని అందరిలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి.

 అయితే వరల్డ్ క్రికెట్లో రికార్డులను సాధించడం విషయంలోనే కాదు.. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం విషయంలో కూడా విరాట్ కోహ్లీ తోపు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటితరం స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎవరికి అందనంత దూరంలో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే కోహ్లీకి ఉన్న క్రేజ్ దృశ్య అటు ఎన్నో కంపెనీలు అతనితో ప్రమోషన్స్ చేయించుకోవాలని ఆశపడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం పదికి పైగా బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాడు కోహ్లీ. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ  ఒక బ్రాండ్ ప్రమోషన్ నుంచి తప్పుకున్నాడట.

 స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయినా ప్యూమాతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాంట్రాక్టు ఇటీవల  ముగిసింది. 8 ఏళ్లపాటు ఆ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను విరాట్ కోహ్లీ ఏకంగా 110 కోట్ల రూపాయలు అర్జించారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇక ఫ్యూమాతో కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో.. మళ్లీ ఇక ఆ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు నిరాకరించాడట. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ అజిలీ టాప్ అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా మారబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇందుకుగాను రెమ్యూనరేషన్ తో పాటు ఆ సంస్థలో ఈక్విటీ కూడా పొందబోతున్నాడట కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: