లలిత్ మోడీ.. నా కెరియర్ ముగిస్తాను అని బెదిరించాడు : భారత మాజీ

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రేజ్ ఉంది కాబట్టే ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చినా కూడా అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లు ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమ కెరియర్లో ఎదురైన వివాదాల గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా క్రికెటర్ ఇలాంటివి చెప్పారు అంటే చాలు ఇక వారికి సంబంధించిన వార్తలు కాస్త సంచలనంగా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇటీవల భారత మాజీ క్రికెటర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న సమయంలో తనకు ఐపీఎల్ మాజీ కమిషనర్ నుంచి చేదు అనుభవం ఎదురయింది అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్. ఏకంగా ఐపీఎల్ మాజీ కమిషనర్ తన కెరియర్ ముగిస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ షాకింగ్ విషయాలను ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అని చెప్పాలి.

 ఇలా ఐపిఎల్ ఆడుతున్న సమయంలో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ తన కెరియర్ ముగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తొలి సీజన్లో ప్రవీణ్ కుమార్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అయితే తన స్వస్థలానికి దగ్గరగా ఉంటుంది అన్న కారణంతో ఢిల్లీ జట్టు తరఫున ఆడాలని అనుకున్నాడట ఈ మాజీ ప్లేయర్. ఈ విషయాన్ని అప్పుడు ఐపీఎల్ కమిషనర్ గా ఉన్న లలిత్ మోడీకి చెబితే తనపై ఏకంగా బెదిరింపులకు దిగాడని కెరియర్ ముగిస్తాను అంటూ బెదిరించాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భారత ఆటగాళ్లు అందరూ కూడా మద్యం తాగుతారని.. కానీ తనను ఒక్కడినే తాగుబోతుల చిత్రీకరించారు అంటూ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: