చివరి ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్.. అభివాదం చేసిన కోహ్లీ?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ తమ కెరియర్ చివరి దశలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పుడు చివరి టెస్టు సిరీస్ లో ఆడుతూ ఉండడం గమనార్హం. ఒకవైపు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఇక తనకు చివరి టెస్టు అని ఇప్పటికే ప్రకటించాడు. ఇక అంతకు ముందుగానే వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 అచ్చం ఇలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సైతం ఇక భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్ తనకు కెరియర్లో చివరి టేస్ట్ అంటూ ఇప్పటికే ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తన చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే అంతకు ముందు జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఏకంగా ఒక ఇన్నింగ్స్ తోపాటు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇక అదే జోరులో రెండో టెస్టుల్లో రంగంలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది.

 ఊహించని రీతిలో ఏకంగా 55 పరుగులకే ఆల్ అవుట్ అయింది సౌత్ ఆఫ్రికా జట్టు. కేప్ టౌన్ పిచ్ బౌలర్లకు స్వర్గధామంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా కెప్టెన్ డీలర్ తన చివరి మ్యాచ్ ఆడేసాడు. భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ అతడికి చివరిది. కాగా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులకే అవుట్ అయిన ఈ స్టార్ ప్లేయర్.  రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి వెనుతిరికాడు. అయితే చివరి ఇన్నింగ్స్ లో అతడికి క్యాచ్ అందుకున్న కోహ్లీ.. డీన్ ఎల్గర్ కు అభివాదం చేయాలి అభిమానులందరూ కోరారు. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన డీన్ ఎల్గర్ అభివాదం చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: