టీమిండియా ఓటమి.. రహానే పోస్ట్ వైరల్?

praveen
టీమిండియా జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య సఫారీ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారత జట్టు సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమ్ ఇండియా.. ఇక సఫారీల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలయింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే టీమిండియా అట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా భారత జట్టులో ఉన్న కీలకమైన ప్లేయర్లందరూ కూడా బ్యాటింగ్లో విఫలం కావడంతో ఇక టీమిండియాకు గెలిచేందుకు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన రహనే పూజారాలను తీసుకొని ఉంటే బాగుండేది అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి పరిస్థితుల మధ్య అజింక్య  రహానే పెట్టిన ఒక పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సరిగ్గా టీమ్ ఇండియా ఓటమిపాలు అయిన తర్వాత రహనే తాను నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే భారత జట్టు ఓడిపోయిన సమయంలో ఇలాంటి వీడియో పెట్టడం సరికాదు అని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. తనను టీంలోకి తీసుకోకపోవడం కారణంగానే తన అసంతృప్తిని ఈ రూపంలో వ్యక్తపరిచాడు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: