టీమిండియా ఓటమి.. రహానే పోస్ట్ వైరల్?
ఏకంగా సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమ్ ఇండియా.. ఇక సఫారీల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలయింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే టీమిండియా అట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా భారత జట్టులో ఉన్న కీలకమైన ప్లేయర్లందరూ కూడా బ్యాటింగ్లో విఫలం కావడంతో ఇక టీమిండియాకు గెలిచేందుకు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన రహనే పూజారాలను తీసుకొని ఉంటే బాగుండేది అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య అజింక్య రహానే పెట్టిన ఒక పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సరిగ్గా టీమ్ ఇండియా ఓటమిపాలు అయిన తర్వాత రహనే తాను నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే భారత జట్టు ఓడిపోయిన సమయంలో ఇలాంటి వీడియో పెట్టడం సరికాదు అని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. తనను టీంలోకి తీసుకోకపోవడం కారణంగానే తన అసంతృప్తిని ఈ రూపంలో వ్యక్తపరిచాడు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.