ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న.. తెలుగు క్రికెటర్స్ లిస్ట్ ఇదే?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న మినీ వేలం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎవరు అత్యధిక ధర పలకబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే స్టార్ ప్లేయర్లకు భారీ ధర పలకడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఈ ఐపీఎల్ లో ఇక అన్ని ఫ్రాంచైజీల దృష్టిలో పడి ఇక టోర్నీలో భాగం కావాలని ఆశ పడుతున్నారు. ఇక ఇలా ఐపిఎల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. భారత జట్టులో ఛాన్స్ దక్కించుకోవాలని ఆశపడుతున్నారు అని చెప్పాలి.


 అయితే గత కొంతకాలం నుంచి ఇలా ఐపిఎల్ వేలంలో తెలుగు క్రికెటర్లది హవా ఎక్కువగా నడుస్తూ ఉంది. ఒకప్పుడు ఆటోవాలా కొడుకు అయినా మహమ్మద్ సిరాజ్ వేలంలో భారీ ధర పలకడంతో వార్తలో హాట్ టాపిక్ మారిపోయాడు. ఇక గతంలో జరిగిన మెగా వేలంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. వీళ్ళు మాత్రమే కాకుండా మరి కొంతమంది క్రికెటర్లు కూడా ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు మినీ వేలం జరుగుతున్న నేపథ్యంలో ఈ వేలంలో ఎంతమంది తెలుగు క్రికెటర్లు పాల్గొనబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 ఆ వివరాలు చూసుకుంటే.. మొత్తంగా 13 మంది తెలుగు ప్లేయర్లు నేడు జరగబోయే ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. మొత్తంగా ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. నేడు జరగబోయే వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు క్రికెటర్లలో హనుమ విహారి, కె.ఎస్ భరత్,  రికీ బోయ్, పృథ్వీరాజ్ ఎర్ర, రవితేజ, మనీష్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆరవెల్లి అవనీష్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షన్ రెడ్డి,  రాహుల్ బుద్ధి, రోహిత్ నాయుడు, అనికేత్ రెడ్డి ఇక ఈ వేలంలో పాల్గొంటున్న తెలుగు క్రికెటర్లుగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: